అక్షరటుడే, వెబ్​డెస్క్​: మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం మూడు వేల స్పెషల్​ బస్సులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలాకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెళ్లికి 51 బస్సులను అదనంగా నడపనున్నారు.