అక్షరటుడే, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇది కేవలం కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులకు దర్శనానికి పట్టే సమయం. నిన్న వేంకటేశ్వర స్వామిని 79,705 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,836 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.