అక్షరటుడే, వెబ్​డెస్క్​: మహిళల్లో చీర ప్రాముఖ్యత, ఫిట్​నెస్ అవసరాన్ని మిళితం చేస్తూ హైదరాబాద్​లో నిర్వహించిన ‘సారీ రన్​’ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. హైదరాబాద్​కు చెందిన తనైరా సంస్థ, బెంగుళూరుకు చెందిన ఫిట్​నెస్​ కంపెనీ జేజే యాక్టివ్​ సంయుక్తంగా ఈ సారీ రన్​ను నిర్వహించారు. పీపీ నరసింహారావు మార్గ్​లో జరిగిన ఈ రన్​లో చీరలు ధరించిన 3,120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చంటిబిడ్డలతో కలిసి పరిగెత్తారు. ఆధునిక యుగంలో చీరకు ఉన్న ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసేందుకు.. మహిళల్లో ఫిట్​నెస్​పై అవగాహన కల్పించేందుకు ఈ రన్​ నిర్వహించినట్లు ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు.