అక్షరటుడే, వెబ్డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20 శనివారం సాయంత్రం ఏడు గంటలకు చైన్నైలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న భారత్ రెండో టీ20లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా ఫస్ట్ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఓపెనర్ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియదు. మరోవైపు ఈ మ్యాచ్తో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని ఇంగ్లిష్ జట్టు చూస్తోంది.