అక్షరటుడే, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో 55 మంది ప్రభుత్వ వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. లోకాయుక్త ఆదేశాలతో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొలగించిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రభుత్వ వైద్యుల వ్యవహారశైలిపై కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న లోకాయుక్త.. సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాని వారిని తొలగించాలని ఆదేశించింది.