అక్షరటుడే, బోధన్: బోధన్​ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లిలో కరెంట్​ షాక్​తో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. రెంజల్​ మండలం సాటాపూర్​ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్​ షాక్ తో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయంలో వారు అక్కడికి ఎందుకు వెళ్లారనే విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.