అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండలం కరేగాం మంజీరా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.