అక్షరటుడే, వెబ్డెస్క్: విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ తీసుకు వస్తామన్నారు. దీనికోసం అణుశక్తి చట్టానికి సవరణ చేసి ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే జల జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీనికింద ఇంటింటికి మంచినీరు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.