అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి రూ.50 వేల కోట్లు దోచుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఈ స్కీం తెచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఉచితంగా ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి.. ఇప్పుడు పెద్ద స్కాంకు తెరలేపారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజలు చనిపోతే డబ్బులు వసూలు చేయడానికి డెత్ రెగ్యులేషన్ స్కీం కూడా తెస్తారని ఆరోపించారు.