అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా దేశంలో మాత్రం పెరగలేదని కేంద్ర మంరతి కిషన్​రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు పెంచి రైతులపై భారం పడకుండా చూస్తోందని పేర్కొన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ రావాలన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం దోచుకుందని.. ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు.