అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వరాలు కురిపించారు. స్టార్టప్లను ప్రోత్సహించడానికి చర్యలు చేపడతామన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితి రూ.పది కోట్లకు పెంచారు. స్టార్టప్లకు రూ.పది కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.