అక్షరటుడే, కామారెడ్డి: ఫేక్ ఫోన్ పే యాప్​తో మోసం చేస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడకు చెందిన ప్రవీణ్ ఫేక్ ఫోన్ పే యాప్ డౌన్​ లోడ్​ చేసుకున్నాడు. డబ్బులు ఇస్తే ఫోన్ పే చేస్తానని కొందరిని నమ్మించాడు. దేవునిపల్లి గ్రామంలోని ఓ కిరాణా షాప్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వండి ఫోన్ పే చేస్తానని చెప్పాడు. దీంతో కిరాణా షాప్ యజమాని డబ్బులు ఇవ్వడంతో ప్రవీణ్ ఫోన్ పే చేశాడు. ప్రవీణ్ ఫోన్​లో డబ్బులు సెండ్ అయినట్లు చూపించినా కిరాణా షాప్ యజమాని అకౌంట్లో మాత్రం జమ కాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి ప్రవీణ్​ను నిలదీయగా అది ఫేక్ ఫోన్ పే యాప్ అని ఒప్పుకున్నాడు. దీంతో స్థానికులు ప్రవీణ్​ను పోలీసులకు అప్పగించారు.