అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ హాఫ్​ సెంచరీతో రాణించాడు. రోహిత్(20) దూకుడిగా ఆడి త్వరగా అవుట్​ కాగా, గిల్​(46) పరుగుల వద్ద బౌల్డ్​ అయ్యాడు. ప్రస్తుతం భారత్​ 26.4 ఓవర్లలో 134 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(52), శ్రేయాస్​(13) ఉన్నారు.