అక్షరటుడే, భీమ్​గల్​: రాష్ట్రంలో 61ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్​గల్​ మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వీఆర్​ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. 61 ఏళ్లు నిండిన వీఆర్​ఏల వారసులుగా తాము పదిహేనేళ్లుగా పని చేస్తున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా 3,798 మందిని రెగ్యులర్​ చేయాలని డిమాండ్ చేశారు.