అక్షరటుడే, హైదరాబాద్: ఓ వైపు SLBC టన్నెల్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్ట ఆలయ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం(నేడు) నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసుకోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
