అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నవనాథపురం ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్‌ క్యాన్సర్​ డే నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్​ బారినపడి కోలుకున్నవేల్పూర్‌ మండలం పడగల్‌ మాజీ ఎంపీటీసీ వెలమల గంగామణిని సన్మానించారు. క్యాన్సర్​ బాధితులు ధైర్యం కోల్పోవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్, కోశాధికారి నారాయణ గౌడ్, చెన్న రవి, విజయానంద్, కార్యదర్శి సురేష్‌ కుమార్, దయశీల్, పుణ్యరాజ్, రామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.