అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ‘అక్షరటుడే’ కృషి అభినందనీయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్ రావు అన్నారు. పట్టణంలో సోమవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనతికాలంలోనే డిజిటల్ మీడియాలో ‘అక్షరటుడే’ ప్రజాదరణ పొందుతోందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్​ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా, ‘అక్షరటుడే’ ఎల్లారెడ్డి ఆర్సీ ఇన్​ఛార్జి వడ్ల రవికుమార్, కాంగ్రెస్ నాయకులు నాగం గోపి తదితరులు పాల్గొన్నారు.