అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్​ అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు జగన్​ హాజరవ్వలేదు. ప్రస్తుతం నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం శాసనసభకు హాజరుకానున్నట్లుసమాచారం. సోమవారం గవర్నర్​ ప్రసంగానికి వీరంతా హాజరవనున్నట్లు తెలుస్తోంది.