నగరంలో గొలుసు చోరీ

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో గొలుసు చోరీ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్ కు వచ్చారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ED | యువతుల అక్రమ రవాణా కేసు.. దూకుడు పెంచిన ఈడీ