అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి అన్నారు. గ్రామసభలతో ప్రజల మధ్య కాంగ్రెస్​ గొడవలు పెడుతోందని ఆరోపించారు. ఒక్క గ్రామంలో అయినా లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహిస్తే.. మంత్రులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.