Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఆరుగురికి జైలుశిక్ష పడినట్లు ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా.. 17 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని సెకండ్​క్లాస్​ మేజిస్ట్రేట్​ నూర్జహాన్​ ఎదుట హాజరుపర్చగా.. ఆరుగురికి జైలుశిక్ష, మరో 11మందికి రూ. 15,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్​ సీఐ తెలిపారు.

Advertisement