అక్షరటుడే, కామారెడ్డి: పిచ్చికుక్క దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం టోల్గేట్ సమీపంలో ఒకరిని కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం గ్రామంలో మరో నలుగురిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో రామేశ్వర్పల్లికి చెందిన నాగర్తి రాధవ్వ, గొల్లపల్లి వినోద్ గౌడ్, గొల్లపల్లి నాగరాజు గౌడ్, సందుగారి లలిత, పైతరి సుశీల ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement