అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ.. నూతన మండలంగా ఏర్పడిన పోతంగల్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పట్నం రాములు, మేకల మల్లేశ్, ఆవాజ్, మహమ్మద్ ఖాన్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.