భారత్​లో గూగుల్ రిటైల్​​ స్టోర్​

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: గూగుల్ కంపెనీ అమెరికా బయట తొలి రిటైల్​ స్టోర్​ను భారత్​లో ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి అమెరికాలో ఐదు స్టోర్లు ఉన్నాయి. భారత్​ను కీలక మార్కెట్​గా చూస్తున్న గూగుల్​ ఇక్కడ పది బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో రిటైల్​ స్టోర్​లను ఏర్పాటు చేయనుంది. ముంబాయి, ఢిల్లీలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బెంగళూరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ స్టోర్​లలో తన పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లతో పాటు, ఇయర్​ బడ్స్, వాచ్​లను విక్రయించనుంది. యాపిల్​ కంపెనీకి పోటీగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.