అక్షరటుడే, వెబ్డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. వాంఖడే మైదానంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (135) సిక్స్లు, ఫోర్లతో రెచ్చిపోవడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన ఈ ఓపెనర్ తన కెరీర్లో వేగవంతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శివమ్ దూబే 30, తిలక్వర్మ 24 పరుగులతో రాణించడంతో భారత జట్టు 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది. టీ 20లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచారు.