అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత్​ ఆడుతున్న తొలి మ్యాచ్​లో మన బౌలర్లు విజృంభిస్తున్నారు. దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లాదేశ్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. చాలాకాలం తర్వాత పునరాగమనం చేసిన మహ్మద్​ షమీ ఈ మ్యాచ్​లో తన సత్తా చాటాడు. తొలి ఓవర్​లోనే వికెట్​ తీసి భారత జట్టులో ఆనందం నింపాడు. తర్వాత ఓవర్​లో హర్షిత్​ రాణా బంగ్లా కెప్టెన్​ను ఇంటికి పంపాడు. షమీ రెండు వికెట్లు తీశాడు. అక్షర్​ పటేల్​ కూడా ఇద్దరిని పెవిలియన్​కు పంపడంతో బంగ్లాదేశ్​ 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా జట్టు 14 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.