అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇద్దరు చైన్​ స్నాచర్లను అరెస్ట్​ చేసినట్లు మెదక్​ ఎస్పీ ఉదయ్​కుమార్​ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మెదక్​ పట్టణం ఫతేనగర్​కు చెందిన మహ్మద్​ అబ్దుల్​ ఖాదీర్​, మహ్మద్​ అబ్దుల్​ షఫీ ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై హవేళి ఘనపూర్​ మండలంలో మూడు, కామారెడ్డి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం రికవరీ చేశామని చెప్పారు.