అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని వాషింగ్టన్ డీసీ‌లో రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక హెలికాప్టర్‌ను PSA ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఢీకొట్టింది. దీంతో విమానం సమీపంలో ఉన్న పొటామక్ నదిలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్లైట్​లో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు. విమానం కూలిపోయిన పొటామక్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.