అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: నగరంలోని ఆరో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో పలువురు పోగొట్టుకున్న ఫోన్లన రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఈఐఆర్​ పోర్టల్​ ద్వారా ఫోన్లను రికవరీ చేసి మంగళవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన కానిస్టేబుల్​ యాస్మిన్​ను ఉన్నతాధికారులు అభినందించారు.