అక్షరటుడే, కామారెడ్డి: తనకు కమీషన్​ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భిక్కనూరు ఎస్​బీఐ సర్వీస్​ పాయింట్​ నిర్వాహకుడు కైరంకొండ ఆంజనేయులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను 2018 డిసెంబర్​లో గ్రామంలో సర్వీస్​ పాయింట్​ పెట్టుకున్నట్లు చెప్పారు. 2020 నుంచి కమీషన్​ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్బీవో సమావేశంలో కమీషన్ విషయం అడిగితే ఏమైనా చేసుకోండని మాట్లాడారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్​ను కోరారు.