అక్షరటుడే, వెబ్​డెస్క్ : వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ను కలిసి రాజీనామా అందజేశారు. కాగా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ‘ఎక్స్’​ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్​లో ఏ పార్టీలో చేరనని ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన వైఎస్​ జగన్​కు ధన్యవాదాలు తెలిపారు. ఆది నుంచి వైఎస్​ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.